హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన
హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన
Editor Desk
ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం
నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.
యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి