Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 05:41 PM

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన
March 26, 2026 03:53 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News