Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన
26-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

Sthanikam

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

Article Image

ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News