Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:17 AM

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన
March 26, 2026 03:53 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News