Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:02 AM

హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య

హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య

హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య
March 20, 2026 09:34 PM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరెంట్ కోతలు, యూరియా కొరత

నకిరేకల్‌లో మాఫియా రాజ్యం… కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఆరోపణలు

నల్లగొండ జిల్లా: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో పాత రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు.

“ఉగాది పచ్చడిలా ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను ఊరించి కాలయాపన చేస్తున్నారు. కొత్త పథకాలు తీసుకురాలేక, ఉన్నవాటినే నిలిపివేస్తున్నారు” అని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై స్పందిస్తూ.. “24 గంటల కరెంట్‌కు స్వస్తి చెప్పి, 12 గంటలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది” అని పేర్కొన్నారు.

రైతుల సమస్యలపై మాట్లాడిన ఆయన.. “పంట వేసిన దగ్గర నుంచి కొనుగోలు వరకు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కల్తీ ధాన్యం, కరెంట్ కోతలు, యూరియా కొరత, కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికారులు వింత పోకడలు పోతున్నారని ఆరోపించారు. “ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కాంగ్రెస్ నాయకులకు లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు ఐకేపీ కేంద్రాలను కేటాయిస్తున్నారు” అని తెలిపారు.

అలాగే నియోజకవర్గంలో మైనింగ్, మట్టి, ఇసుక మాఫియాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News