హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య
హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య
స్థానికం బృందం
కరెంట్ కోతలు, యూరియా కొరత
నకిరేకల్లో మాఫియా రాజ్యం… కాంగ్రెస్పై మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఆరోపణలు
నల్లగొండ జిల్లా: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో పాత రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు.
“ఉగాది పచ్చడిలా ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను ఊరించి కాలయాపన చేస్తున్నారు. కొత్త పథకాలు తీసుకురాలేక, ఉన్నవాటినే నిలిపివేస్తున్నారు” అని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై స్పందిస్తూ.. “24 గంటల కరెంట్కు స్వస్తి చెప్పి, 12 గంటలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది” అని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై మాట్లాడిన ఆయన.. “పంట వేసిన దగ్గర నుంచి కొనుగోలు వరకు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కల్తీ ధాన్యం, కరెంట్ కోతలు, యూరియా కొరత, కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికారులు వింత పోకడలు పోతున్నారని ఆరోపించారు. “ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కాంగ్రెస్ నాయకులకు లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు ఐకేపీ కేంద్రాలను కేటాయిస్తున్నారు” అని తెలిపారు.
అలాగే నియోజకవర్గంలో మైనింగ్, మట్టి, ఇసుక మాఫియాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి