Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:55 PM

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
01-05-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేటలోని స్థానిక పౌరసరఫరాల గోదాం వద్ద బీఆర్‌టీయూ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించేది కార్మికుల శ్రమేనని, వారి త్యాగాలు అమూల్యమని పేర్కొన్నారు. కార్మికులు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి బలంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాబు మియా మాట్లాడుతూ మేడే కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన చారిత్రక దినమని, కార్మికుల పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు, 8 గంటల పని విధానం సాధ్యమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Article Image

సదాశివపేటలోని స్థానిక పౌరసరఫరాల గోదాం వద్ద బీఆర్‌టీయూ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించేది కార్మికుల శ్రమేనని, వారి త్యాగాలు అమూల్యమని పేర్కొన్నారు. కార్మికులు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి బలంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాబు మియా మాట్లాడుతూ మేడే కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన చారిత్రక దినమని, కార్మికుల పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు, 8 గంటల పని విధానం సాధ్యమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News