Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:33 AM

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు
03-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలోని బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ఈనెల 27న ప్రారంభమైన పాదయాత్ర పల్లకీసేవ సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మార్చి 5న నిర్వహించనున్న 47వ వార్షిక అమరతిథి కార్యక్రమాల సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లాపూర్ ఆశ్రమం నుంచి బయలుదేరిన పాదయాత్రికులు నారాయణఖేడ్, లింగంపల్లి, మహబత్పూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళ బసచేస్తూ భజనలతో, కీర్తనలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు నిండుకుండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు సమర్పించారు. తదుపరి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక పూజలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాదయాత్రికులు మరియు ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి భావాలను పెంపొందిస్తూ గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు

Article Image

న్యాల్కల్: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలోని బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ఈనెల 27న ప్రారంభమైన పాదయాత్ర పల్లకీసేవ సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మార్చి 5న నిర్వహించనున్న 47వ వార్షిక అమరతిథి కార్యక్రమాల సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లాపూర్ ఆశ్రమం నుంచి బయలుదేరిన పాదయాత్రికులు నారాయణఖేడ్, లింగంపల్లి, మహబత్పూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళ బసచేస్తూ భజనలతో, కీర్తనలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు నిండుకుండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు సమర్పించారు. తదుపరి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక పూజలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాదయాత్రికులు మరియు ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి భావాలను పెంపొందిస్తూ గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News