హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు
హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలోని బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ఈనెల 27న ప్రారంభమైన పాదయాత్ర పల్లకీసేవ సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మార్చి 5న నిర్వహించనున్న 47వ వార్షిక అమరతిథి కార్యక్రమాల సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లాపూర్ ఆశ్రమం నుంచి బయలుదేరిన పాదయాత్రికులు నారాయణఖేడ్, లింగంపల్లి, మహబత్పూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళ బసచేస్తూ భజనలతో, కీర్తనలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు నిండుకుండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు సమర్పించారు. తదుపరి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక పూజలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాదయాత్రికులు మరియు ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి భావాలను పెంపొందిస్తూ గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి