గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక
గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో గుట్ట పోరంబోకు భూముల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఎకరానికి రూ.10,000 చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని పట్టాల ఖర్చులకు లేదా విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విషయాన్ని పరిశీలించారు.
ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టి కి వెళ్ళగా మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. భూముల విషయంలో ప్రజలను మోసం చేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే, వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలకు లొంగకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి