Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక
17-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో గుట్ట పోరంబోకు భూముల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఎకరానికి రూ.10,000 చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని పట్టాల ఖర్చులకు లేదా విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విషయాన్ని పరిశీలించారు.

ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టి కి వెళ్ళగా మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. భూముల విషయంలో ప్రజలను మోసం చేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే, వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలకు లొంగకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో గుట్ట పోరంబోకు భూముల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఎకరానికి రూ.10,000 చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని పట్టాల ఖర్చులకు లేదా విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విషయాన్ని పరిశీలించారు.

ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టి కి వెళ్ళగా మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. భూముల విషయంలో ప్రజలను మోసం చేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే, వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలకు లొంగకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News