గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.
గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనం పల్లి బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగమ్మ తెలిపారు.
జూనియర్ కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల విభాగంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా పీజీతో పాటు బీఈడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనం పల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల యాజమాన్యం కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి