Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:57 AM

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి
March 24, 2026 06:57 PM 247 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి కేంద్రంలోని ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు గురుకుల పాఠశాలల ప్రవేశ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. పరీక్ష రాసిన 35మందిలో 34మంది సీట్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు.

ఇప్పటికే నవోదయ ఫలితాల్లో 24 సీట్లు సాధించిన ఆనందం కొనసాగుతుండగానే, తాజా గురుకుల ఫలితాల్లో కూడా ఈ విజయంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. సర్వేల్, చౌటుప్పల్, ఏన్కూర్, బూర్గంపహాడ్, వైరా, ముదిగొండ, రఘునాథపాలెం వంటి ప్రముఖ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు సీట్లు కైవసం చేసుకున్నారు.

ఫలితాలు వెల్లడైన వెంటనే కోచింగ్ సెంటర్‌లో సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అకడమిక్ డీన్ అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ, విద్యార్థుల కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తల్లిదండ్రుల విశ్వాసమే తమకు బలం అని తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరాల్లోనూ ఇదే విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News