గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి
గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి
Editor Desk
కూసుమంచి కేంద్రంలోని ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు గురుకుల పాఠశాలల ప్రవేశ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. పరీక్ష రాసిన 35మందిలో 34మంది సీట్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు.
ఇప్పటికే నవోదయ ఫలితాల్లో 24 సీట్లు సాధించిన ఆనందం కొనసాగుతుండగానే, తాజా గురుకుల ఫలితాల్లో కూడా ఈ విజయంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. సర్వేల్, చౌటుప్పల్, ఏన్కూర్, బూర్గంపహాడ్, వైరా, ముదిగొండ, రఘునాథపాలెం వంటి ప్రముఖ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు సీట్లు కైవసం చేసుకున్నారు.
ఫలితాలు వెల్లడైన వెంటనే కోచింగ్ సెంటర్లో సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అకడమిక్ డీన్ అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ, విద్యార్థుల కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తల్లిదండ్రుల విశ్వాసమే తమకు బలం అని తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరాల్లోనూ ఇదే విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి