Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:59 PM

గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.500 కోట్లు – కేంద్ర నిర్ణయానికి హర్షం బుర్రి శ్రీకర్

గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.500 కోట్లు – కేంద్ర నిర్ణయానికి హర్షం బుర్రి శ్రీకర్

గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.500 కోట్లు – కేంద్ర నిర్ణయానికి హర్షం బుర్రి శ్రీకర్
February 26, 2026 12:11 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.500 కోట్లు కేంద్ర నిర్ణయానికి హర్షం

చాట్రాయి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిన నిర్ణయాన్ని ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, గురుకుల పాఠశాలల బలోపేతానికి భారీ నిధులు మంజూరు చేయడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల విస్తరణ, కొత్త తరగతి గదుల నిర్మాణం, హాస్టల్ సదుపాయాల మెరుగుదల, విద్యార్థులకు నాణ్యమైన విద్యా–వైద్య సౌకర్యాల కల్పనకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ, పేద విద్యార్థుల భవిష్యత్తును బలపరిచే దిశగా కేంద్రం ముందడుగు వేస్తోందన్నారు.

ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే మన్కా కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం అవుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుపై, దేశ ప్రగతిపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News