Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:58 PM

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు
March 26, 2026 08:25 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంపటి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది.

ఈ పరీక్షకు పాఠశాల నుండి మొత్తం 35 మంది విద్యార్థులు హాజరుకాగా,వారిలో 28 మంది విద్యార్థులు అర్హత సాధించి సీటు పొందారు. పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను అభినందించడం జరిగింది.ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ... మాపాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయము ఎంతో గర్వకారణమని గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఉన్నత లక్ష్యాలను చేరగలరని మరోసారి నిరూపించారని ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, నిరంతర సాధనతో ఈ ఫలితాలను సాధించగలిగారనితల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఆసక్తి చూపడం వల్లే ఈ విజయo సాధ్యమైందన్నారు .భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాల తరపున అన్ని విధాల కృషి చేస్తామనిఅన్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ..

విద్యార్థులకు పునాది స్థాయి నుంచే సరైన మార్గదర్శనం,సాధన,పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందానికికృతజ్ఞతలు తెలిపారు.గ్రామ పెద్దలు ఈ విజయాన్ని ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ విజయంతో వెంపటి పాఠశాల జిల్లా స్థాయిలో ఒక ఆదర్శ పాఠశాలగా నిలిచిందని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయబృందం భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాకరవీందర్,గట్టు మాధవి, నిమ్మరబోయిననవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల,శీలోజు రమాదేవిలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News