Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు
26-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంపటి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది.

ఈ పరీక్షకు పాఠశాల నుండి మొత్తం 35 మంది విద్యార్థులు హాజరుకాగా,వారిలో 28 మంది విద్యార్థులు అర్హత సాధించి సీటు పొందారు. పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను అభినందించడం జరిగింది.ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ... మాపాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయము ఎంతో గర్వకారణమని గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఉన్నత లక్ష్యాలను చేరగలరని మరోసారి నిరూపించారని ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, నిరంతర సాధనతో ఈ ఫలితాలను సాధించగలిగారనితల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఆసక్తి చూపడం వల్లే ఈ విజయo సాధ్యమైందన్నారు .భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాల తరపున అన్ని విధాల కృషి చేస్తామనిఅన్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ..

విద్యార్థులకు పునాది స్థాయి నుంచే సరైన మార్గదర్శనం,సాధన,పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందానికికృతజ్ఞతలు తెలిపారు.గ్రామ పెద్దలు ఈ విజయాన్ని ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ విజయంతో వెంపటి పాఠశాల జిల్లా స్థాయిలో ఒక ఆదర్శ పాఠశాలగా నిలిచిందని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయబృందం భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాకరవీందర్,గట్టు మాధవి, నిమ్మరబోయిననవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల,శీలోజు రమాదేవిలు పాల్గొన్నారు.

Sthanikam

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లోజిల్లాలో ప్రతిభ కనబరిచిన వెంపటి విద్యార్థులు ప్రతిభ కనబరిచిన ఎప్పటి విద్యార్థులు

Article Image

తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంపటి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది.

ఈ పరీక్షకు పాఠశాల నుండి మొత్తం 35 మంది విద్యార్థులు హాజరుకాగా,వారిలో 28 మంది విద్యార్థులు అర్హత సాధించి సీటు పొందారు. పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను అభినందించడం జరిగింది.ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ... మాపాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయము ఎంతో గర్వకారణమని గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఉన్నత లక్ష్యాలను చేరగలరని మరోసారి నిరూపించారని ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, నిరంతర సాధనతో ఈ ఫలితాలను సాధించగలిగారనితల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ఆసక్తి చూపడం వల్లే ఈ విజయo సాధ్యమైందన్నారు .భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించేందుకు పాఠశాల తరపున అన్ని విధాల కృషి చేస్తామనిఅన్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ..

విద్యార్థులకు పునాది స్థాయి నుంచే సరైన మార్గదర్శనం,సాధన,పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందానికికృతజ్ఞతలు తెలిపారు.గ్రామ పెద్దలు ఈ విజయాన్ని ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ విజయంతో వెంపటి పాఠశాల జిల్లా స్థాయిలో ఒక ఆదర్శ పాఠశాలగా నిలిచిందని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయబృందం భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాకరవీందర్,గట్టు మాధవి, నిమ్మరబోయిననవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల,శీలోజు రమాదేవిలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News