Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:01 PM

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
20-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

క్రమం తప్పని తనిఖీలు, నోడల్ అధికారుల నియామకం – నెలనెలా నివేదికలు తప్పనిసరి

హైదరాబాద్: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యాసంస్థల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర విచారణ కాలపట్టికను సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా వారీగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆకస్మిక సందర్శనలతో పాటు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే సంబంధిత విభాగానికి సమర్పించాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలను తక్షణమే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా ఐదవ తేదీలోపు తనిఖీ నివేదిక సమర్పణను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Article Image

క్రమం తప్పని తనిఖీలు, నోడల్ అధికారుల నియామకం – నెలనెలా నివేదికలు తప్పనిసరి

హైదరాబాద్: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యాసంస్థల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర విచారణ కాలపట్టికను సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా వారీగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆకస్మిక సందర్శనలతో పాటు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే సంబంధిత విభాగానికి సమర్పించాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలను తక్షణమే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా ఐదవ తేదీలోపు తనిఖీ నివేదిక సమర్పణను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News