గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
Biksham
క్రమం తప్పని తనిఖీలు, నోడల్ అధికారుల నియామకం – నెలనెలా నివేదికలు తప్పనిసరి
హైదరాబాద్: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యాసంస్థల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర విచారణ కాలపట్టికను సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా వారీగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆకస్మిక సందర్శనలతో పాటు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే సంబంధిత విభాగానికి సమర్పించాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలను తక్షణమే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా ఐదవ తేదీలోపు తనిఖీ నివేదిక సమర్పణను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి