గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Biksham
దళారులను నమ్మి పంట అమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి
చివ్వెంల: మండలంలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. హకా ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని న్యాయమైన ధర పొందాలని కోరారు.ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగయ్య, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహ చారి, అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, జిల్లా నాయకులు ఎలుగురి వీరయ్య గౌడ్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకటరెడ్డి, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి