Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:05 PM

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
14-04-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దళారులను నమ్మి పంట అమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

చివ్వెంల: మండలంలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. హకా ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని న్యాయమైన ధర పొందాలని కోరారు.ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగయ్య, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహ చారి, అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, జిల్లా నాయకులు ఎలుగురి వీరయ్య గౌడ్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకటరెడ్డి, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

దళారులను నమ్మి పంట అమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

చివ్వెంల: మండలంలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. హకా ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని న్యాయమైన ధర పొందాలని కోరారు.ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగయ్య, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహ చారి, అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, జిల్లా నాయకులు ఎలుగురి వీరయ్య గౌడ్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకటరెడ్డి, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News