Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:18 PM

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
April 14, 2026 04:40 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దళారులను నమ్మి పంట అమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

చివ్వెంల: మండలంలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. హకా ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని న్యాయమైన ధర పొందాలని కోరారు.ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగయ్య, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహ చారి, అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, జిల్లా నాయకులు ఎలుగురి వీరయ్య గౌడ్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకటరెడ్డి, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News