గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Biksham
రైతులకు మద్దతుగా ప్రోత్సాహకాలు – కొప్పుల వేణారెడ్డి
చివ్వెంల మండలం: మండలంలోని గుంజలూరు గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఈ ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.
తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు అందించే విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.
అందువల్ల రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద కప్పే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ పదిహేడు శాతం ఉండేలా చూడాలని, బస్తా నలభై ఒక కిలోలకే తూకం వేయాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్, వార్డ్ సభ్యులు కొప్పు సైదులు, వ్యవసాయ అధికారి మానస, కార్యక్రమ నిర్వహకులు వెంకయ్య, సైదులు, దొనకొండ శ్రీనివాస్, దొనకొండ వీరయ్య, పెద్ది అంజయ్య, అబ్దుల్ కరీం, బైరు శైలేందర్ గౌడ్, బైరు నాగరాజు, వీరబోయిన అశోక్, వీరబోయిన వీరయ్య, బొజ్జ పాపిరెడ్డి, దారోజు కోటయ్య, కొనకంచి కామేష్, మొలుగురి మైసయ్య, పందిరిముత్యాలమ్మ, పెదపోలు వినోద్, మొలుగురి పుల్లయ్య, ఉప్పాల కవిత, మొలుగురి మణెమ్మ, మొలుగురి సంతోష, మహేశ్వరి, మొలుగురి వెంకన్న, బొల్లికొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి