Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 10:08 PM

గుండ్రంపల్లి వద్ద బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

గుండ్రంపల్లి వద్ద బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

గుండ్రంపల్లి వద్ద బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
February 25, 2026 08:42 PM 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భైరవుని బండ గ్రామానికి చెందిన శేఖర్ (34) ఈ నెల 17వ తేదీ ఉదయం కూలి పనుల నిమిత్తం తన తోటి మిత్రునితో కలిసి చౌటుప్పల్ వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో గుండ్రంపల్లి స్టేజ్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో అతనుతీవ్రగాయాలపాలయ్యాడు.

గాయపడిన శేఖర్‌ను స్థానికులు తొలుత సమీప ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 24వ తేదీన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చిట్యాల ఎస్సై మామిడి రవి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News