Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:44 AM

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన  డిప్యూటీ సీఎం
January 14, 2026 05:52 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందించిన విద్యుత్ సిబ్బంది

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒకటైన "గృహ జ్యోతి పథకం "లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52,82,498 కుటుంబాలు గృహ జ్యోతి పథకం వర్తిస్తుందని దీంతో 200 యూనిట్ లో వరకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించి విద్యుత్ సంస్థలకు చెల్లించామని ఆయన తెలిపారు. విద్యుత్ కొరకు చెల్లించే మొత్తాన్ని పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖాజీ మహళ్ళా లో విద్యుత్ సిబ్బంది గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్ మెన్ శ్రీనివాస్,గృహ జ్యోతి లబ్దిదారులు ఉదయగిరి విద్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News