Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన  డిప్యూటీ సీఎం
January 14, 2026 05:52 AM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందించిన విద్యుత్ సిబ్బంది

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒకటైన "గృహ జ్యోతి పథకం "లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52,82,498 కుటుంబాలు గృహ జ్యోతి పథకం వర్తిస్తుందని దీంతో 200 యూనిట్ లో వరకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించి విద్యుత్ సంస్థలకు చెల్లించామని ఆయన తెలిపారు. విద్యుత్ కొరకు చెల్లించే మొత్తాన్ని పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖాజీ మహళ్ళా లో విద్యుత్ సిబ్బంది గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్ మెన్ శ్రీనివాస్,గృహ జ్యోతి లబ్దిదారులు ఉదయగిరి విద్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News