గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
Sthanikam District Staff Reporter
లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందించిన విద్యుత్ సిబ్బంది
స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒకటైన "గృహ జ్యోతి పథకం "లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52,82,498 కుటుంబాలు గృహ జ్యోతి పథకం వర్తిస్తుందని దీంతో 200 యూనిట్ లో వరకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించి విద్యుత్ సంస్థలకు చెల్లించామని ఆయన తెలిపారు. విద్యుత్ కొరకు చెల్లించే మొత్తాన్ని పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖాజీ మహళ్ళా లో విద్యుత్ సిబ్బంది గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్ మెన్ శ్రీనివాస్,గృహ జ్యోతి లబ్దిదారులు ఉదయగిరి విద్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి