గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్
గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్
Krishna
గోవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని, గోవులకు సేవ చేయడం ద్వారా మూడు కోట్ల దేవతలకు సేవ చేసిన ఫలితం దక్కుతుందని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మెన్ రేణుక చిరు తెలిపారు.సోమవారం, స్థానిక శివారులోని వెంకటాపురం గ్రామ సమీపంలోని శ్రీ గోపాల్ గోశాలను సందర్శించి, గోమాతలకు దాన పెట్టి సేవచేసారు. ఈ సందర్భంగా, గోమాత సేవను తాను అదృష్టంగా భావిస్తున్నానని, గోమాతకు సేవ చేయడం ద్వారా మహా పుణ్యం సంపాదించవచ్చని రేణుక చిరు చెప్పారు.సందర్శన అనంతరం, గోశా నిర్వాహకులతో సమావేశమై, గోవుల ఆరోగ్యం, శుభ్రత, సంరక్షణ పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన సూచనలు కూడా గోశా సిబ్బందికి అందించారు.రేణుక చిరు సమాజంలోని ప్రముఖులు గోశాల సంరక్షణకు ముందుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్దాం, మనీ, లాజర్, దిలీప్, నాని, నితిన్, నవీన్, హర్ష, అంజన్ తదితరులు పాల్గొన్నారు.గోమాత సేవ ద్వారా సమాజానికి మరియు ఆధ్యాత్మిక బలానికి అనేక పుణ్యఫలితాలు వస్తాయని ఈ సందర్శన స్పష్టంగా చూపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి