గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత
గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత
Sthanikam joint District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై నిర్వహించిన ప్రత్యేక దాడిలో అత్యంత శక్తివంతమైన హైడ్రోపోనిక్ గంజాను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా చరిత్రలో ఈ రకమైన మత్తు పదార్థం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం విశేషం.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ ఎక్సైజ్ బృందం ఆపరేషన్ చేపట్టింది. డీసీ జె. హరి కిషన్ పర్యవేక్షణలో, ఏసీ జి. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ రావు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.ఈ రోజు తెల్లవారుజామున మునిపల్లి మండలం కమ్కోల్ టోల్ ప్లాజా వద్ద గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు కేరళకు చెందిన బ్రెయిన్ బాబు (వయసు 30) వద్ద 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా లభ్యమైంది. నిందితుడు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ, పార్టీల కోసం మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.హైడ్రోపోనిక్ గంజా ప్రత్యేకత:సాధారణ గంజాయితో భిన్నంగా,మట్టి లేకుండా నీరు, పోషకాల సహాయంతో గదుల్లో ప్రత్యేక పద్ధతిలో పండించబడే ఈ గంజాలో మత్తును కలిగించే THC శాతం ఎక్కువగా ఉంటుంది. స్వాధీనం చేసిన 86 గ్రాముల విలువ సుమారు రూ. 3.5 లక్షలు అని అధికారులు అంచనా వేశారు.అంటే, ఒక్క గ్రాముకు దాదాపు నాలుగు వేల రూపాయలు పైమాటే.ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు:
సీఐ: బి. గాంధీ నాయక్
ఎస్ఐ: బి. యాదయ్య
హెడ్ కానిస్టేబుల్: ఎం.డి. అలీమ్
కానిస్టేబుళ్లు: అమ్మతుల్ కరీమ్, రామారావు నాయక్, ఎం. గోపాల్, వివేక్, ముజమ్మిల్, వి. కావ్యశ్రీ
నిందితుడిపై నిషేధిత మత్తు పదార్థాల చట్టం 1985 కింద కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి