Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:28 AM

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత
February 27, 2026 08:06 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై నిర్వహించిన ప్రత్యేక దాడిలో అత్యంత శక్తివంతమైన హైడ్రోపోనిక్ గంజాను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా చరిత్రలో ఈ రకమైన మత్తు పదార్థం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం విశేషం.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ ఎక్సైజ్ బృందం ఆపరేషన్ చేపట్టింది. డీసీ జె. హరి కిషన్ పర్యవేక్షణలో, ఏసీ జి. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ రావు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.ఈ రోజు తెల్లవారుజామున మునిపల్లి మండలం కమ్కోల్ టోల్ ప్లాజా వద్ద గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు కేరళకు చెందిన బ్రెయిన్ బాబు (వయసు 30) వద్ద 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా లభ్యమైంది. నిందితుడు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ, పార్టీల కోసం మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.హైడ్రోపోనిక్ గంజా ప్రత్యేకత:సాధారణ గంజాయితో భిన్నంగా,మట్టి లేకుండా నీరు, పోషకాల సహాయంతో గదుల్లో ప్రత్యేక పద్ధతిలో పండించబడే ఈ గంజాలో మత్తును కలిగించే THC శాతం ఎక్కువగా ఉంటుంది. స్వాధీనం చేసిన 86 గ్రాముల విలువ సుమారు రూ. 3.5 లక్షలు అని అధికారులు అంచనా వేశారు.అంటే, ఒక్క గ్రాముకు దాదాపు నాలుగు వేల రూపాయలు పైమాటే.ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు:

సీఐ: బి. గాంధీ నాయక్

ఎస్ఐ: బి. యాదయ్య

హెడ్ కానిస్టేబుల్: ఎం.డి. అలీమ్

కానిస్టేబుళ్లు: అమ్మతుల్ కరీమ్, రామారావు నాయక్, ఎం. గోపాల్, వివేక్, ముజమ్మిల్, వి. కావ్యశ్రీ

నిందితుడిపై నిషేధిత మత్తు పదార్థాల చట్టం 1985 కింద కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News