గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
Prabhakar
ఠాగూర్ అరుణ్ సింగ్జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ వెల్లడి
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ ఠాగూర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. గురువారం గౌతమ్ నగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అరుణ్ సింగ్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్ యు బి మల్లికార్జున నెలకొన్న యు ఎల్ సి సమస్యతోపాటు జయగిరి లక్ష్మీనరసింహస్వామి నగర్ లో నివాసముంటున్న నివాసితులకు క్రమబద్ధీకరణ వంటి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు డ్రైనేజీ, రోడ్లు అంతర్గత సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు తక్కువగా ఉండి రోడ్డుకు ఆనుకొని ఉండటం వల్ల నిత్యం రాకపోకలు సాగించే పాదాచారులతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యా అవకాశం ఉందని తెలిపారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో తాను బరిలో ఉంటానని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి