Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి

గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి

గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
February 12, 2026 11:21 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఠాగూర్ అరుణ్ సింగ్జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ వెల్లడి

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ ఠాగూర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. గురువారం గౌతమ్ నగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అరుణ్ సింగ్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్ యు బి మల్లికార్జున నెలకొన్న యు ఎల్ సి సమస్యతోపాటు జయగిరి లక్ష్మీనరసింహస్వామి నగర్ లో నివాసముంటున్న నివాసితులకు క్రమబద్ధీకరణ వంటి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు డ్రైనేజీ, రోడ్లు అంతర్గత సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు తక్కువగా ఉండి రోడ్డుకు ఆనుకొని ఉండటం వల్ల నిత్యం రాకపోకలు సాగించే పాదాచారులతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యా అవకాశం ఉందని తెలిపారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో తాను బరిలో ఉంటానని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News