Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:43 PM

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
March 27, 2026 06:03 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడునెలల నిష్టతో సిద్ధం చేసిన పవిత్ర బియ్యం – సీతారాముల కళ్యాణానికి భక్తి కానుక

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తి భావంతో తలంబ్రాల బియ్యాన్ని సమర్పించిన సంఘటన భక్తులను ఆకట్టుకుంది.సూర్యాపేట మండలం బాలేం గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత మూడు నెలలుగా వడ్లను గోటితో ఒలిచి సిద్ధం చేసిన బియ్యంలో ఒక కిలో 250 గ్రాముల తలంబ్రాల బియ్యాన్ని శుక్రవారం దేవాలయ కమిటీకి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో తయారు చేసిన ఈ బియ్యాన్ని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అలాగే బొడ్రాయి బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగే కళ్యాణోత్సవానికి కూడా సమర్పించినట్లు తెలిపారు.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి మురళీధర్, కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, దేవర శెట్టి సోమయ్య, అర్చకులు బట్టారం వంశీకృష్ణ, దేవాలయ నిర్వహణాధికారి బచ్చు పురుషోత్తం, భక్తులు పొద్దుటూరి నాగ ప్రసాద్, మహంకాళి కవిత, ఓరుగంటి కనక రత్నం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News