గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
Biksham
మూడునెలల నిష్టతో సిద్ధం చేసిన పవిత్ర బియ్యం – సీతారాముల కళ్యాణానికి భక్తి కానుక
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తి భావంతో తలంబ్రాల బియ్యాన్ని సమర్పించిన సంఘటన భక్తులను ఆకట్టుకుంది.సూర్యాపేట మండలం బాలేం గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత మూడు నెలలుగా వడ్లను గోటితో ఒలిచి సిద్ధం చేసిన బియ్యంలో ఒక కిలో 250 గ్రాముల తలంబ్రాల బియ్యాన్ని శుక్రవారం దేవాలయ కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో తయారు చేసిన ఈ బియ్యాన్ని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అలాగే బొడ్రాయి బజార్లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగే కళ్యాణోత్సవానికి కూడా సమర్పించినట్లు తెలిపారు.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి మురళీధర్, కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, దేవర శెట్టి సోమయ్య, అర్చకులు బట్టారం వంశీకృష్ణ, దేవాలయ నిర్వహణాధికారి బచ్చు పురుషోత్తం, భక్తులు పొద్దుటూరి నాగ ప్రసాద్, మహంకాళి కవిత, ఓరుగంటి కనక రత్నం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి