Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 08:32 PM

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
March 27, 2026 06:03 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడునెలల నిష్టతో సిద్ధం చేసిన పవిత్ర బియ్యం – సీతారాముల కళ్యాణానికి భక్తి కానుక

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తి భావంతో తలంబ్రాల బియ్యాన్ని సమర్పించిన సంఘటన భక్తులను ఆకట్టుకుంది.సూర్యాపేట మండలం బాలేం గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత మూడు నెలలుగా వడ్లను గోటితో ఒలిచి సిద్ధం చేసిన బియ్యంలో ఒక కిలో 250 గ్రాముల తలంబ్రాల బియ్యాన్ని శుక్రవారం దేవాలయ కమిటీకి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో తయారు చేసిన ఈ బియ్యాన్ని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అలాగే బొడ్రాయి బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగే కళ్యాణోత్సవానికి కూడా సమర్పించినట్లు తెలిపారు.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి మురళీధర్, కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, దేవర శెట్టి సోమయ్య, అర్చకులు బట్టారం వంశీకృష్ణ, దేవాలయ నిర్వహణాధికారి బచ్చు పురుషోత్తం, భక్తులు పొద్దుటూరి నాగ ప్రసాద్, మహంకాళి కవిత, ఓరుగంటి కనక రత్నం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News