Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:37 AM

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక
February 08, 2026 07:45 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాశం అజయ్ కుమార్‌ను, గౌరవ అధ్యక్షులుగా చింతకుంట్ల వెంకన్నను, అధ్యక్షులుగా చింతకుంట్ల విఠల్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మందుల నరేష్, చింతకుంట్ల సైదులు (అక్కమ్మ) నియమితులయ్యారు. కార్యదర్శులుగా చింతకుంట్ల పరమేష్ (బాబు), చింతకుంట్ల సురేష్‌లను ఎంపిక చేశారు. కోశాధికారులుగా గాడి పెళ్లి శ్రీనివాసు, చింతకుంట్ల యాకయ్య (అబ్బకొయ్య) బాధ్యతలు స్వీకరించారు.సాంస్కృతిక కార్యదర్శులుగా మందుల యాదగిరి, మందుల మల్లేష్, మందుల మహేష్‌లను, క్రీడా కార్యదర్శులుగా చింతకుంట్ల అనిల్, పాశం పవన్ కళ్యాణ్, చింతకుంట్ల మల్లేష్ (వాజ్ పై), చింతకుంట్ల సాయికుమార్‌లను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శులుగా తడకమల్ల యాకన్న, చింతకుంట్ల ప్రవీణ్ (బబ్లు), మందుల ప్రవీణ్ (బబ్లు) నియమితులయ్యారు. సలహాదారులుగా చింతకుంట్ల చందు, చింతకుంట్ల పరమేష్, జల్గం కళ్యాణ్‌లను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు విఠల్, ఉపాధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ, త్వరలోనే మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే మూడు జిల్లాల స్థాయి క్రీడా టోర్నమెంట్‌ను నిర్వహించి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తామని అన్నారు. సామాజిక చైతన్యం, విద్యాభివృద్ధి లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News