Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 05:56 AM

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక

గొట్టిపర్తిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీ ఎన్నిక
February 08, 2026 07:45 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ నిర్వహణ కమిటీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాశం అజయ్ కుమార్‌ను, గౌరవ అధ్యక్షులుగా చింతకుంట్ల వెంకన్నను, అధ్యక్షులుగా చింతకుంట్ల విఠల్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మందుల నరేష్, చింతకుంట్ల సైదులు (అక్కమ్మ) నియమితులయ్యారు. కార్యదర్శులుగా చింతకుంట్ల పరమేష్ (బాబు), చింతకుంట్ల సురేష్‌లను ఎంపిక చేశారు. కోశాధికారులుగా గాడి పెళ్లి శ్రీనివాసు, చింతకుంట్ల యాకయ్య (అబ్బకొయ్య) బాధ్యతలు స్వీకరించారు.సాంస్కృతిక కార్యదర్శులుగా మందుల యాదగిరి, మందుల మల్లేష్, మందుల మహేష్‌లను, క్రీడా కార్యదర్శులుగా చింతకుంట్ల అనిల్, పాశం పవన్ కళ్యాణ్, చింతకుంట్ల మల్లేష్ (వాజ్ పై), చింతకుంట్ల సాయికుమార్‌లను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శులుగా తడకమల్ల యాకన్న, చింతకుంట్ల ప్రవీణ్ (బబ్లు), మందుల ప్రవీణ్ (బబ్లు) నియమితులయ్యారు. సలహాదారులుగా చింతకుంట్ల చందు, చింతకుంట్ల పరమేష్, జల్గం కళ్యాణ్‌లను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు విఠల్, ఉపాధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ, త్వరలోనే మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే మూడు జిల్లాల స్థాయి క్రీడా టోర్నమెంట్‌ను నిర్వహించి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తామని అన్నారు. సామాజిక చైతన్యం, విద్యాభివృద్ధి లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News