గొట్టిపర్తిలో కబడ్డీ పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
గొట్టిపర్తిలో కబడ్డీ పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
Bandi Kiran Kumar
తుంగతుర్తి,
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్రామ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మూడు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు స్నేహ సంబంధాలను బలపరుస్తాయని తెలిపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన అరుంధతి యూత్ సభ్యులను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
కబడ్డీ పోటీల్లో పలు గ్రామాల జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్లో పనిగిరి, మోతే జట్లు తలపడగా పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి పనిగిరి జట్టు విజయం సాధించింది.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగిల్ డాన్స్, గ్రూప్ డాన్స్, నాటికల ద్వారా వివిధ గ్రామాల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ మహిళలు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పీఈటీలు, అరుంధతి యువజన సంఘం సభ్యులు, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి