Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:11 AM

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
01-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులీచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.




Sthanikam

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

Article Image

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులీచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News