Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:41 PM

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

గొట్టిపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
February 01, 2026 05:17 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులీచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News