Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:07 AM

గొట్టిపర్తి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

గొట్టిపర్తి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

గొట్టిపర్తి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
17-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న, మాజీ ఎంపీటీసీ కృష్ణారావు కేకు కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ...స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కరువు నేలను సిరుల తెలంగాణగా మార్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న, మాజీ ఎంపీటీసీ కృష్ణారావు కేకు కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ...స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 12 ఏళ్లు శాంతియుత మార్గంలో అలుపెరుగని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి కరువు నేలను సిరుల తెలంగాణగా మార్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News