తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శుక్రవారం ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారు
మాట్లాడుతూ... ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలులను ఎదిరించి, పశ్చిమ భారతదేశంలో హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మరియు మరాఠా సామ్రాజ్య నిర్మాతఅని, శివనేరి కోటలో జన్మించిన ఆయన గెరిల్లా యుద్ధతంత్రం, నావికాదళం, మరియు ధైర్యసాహసాలు నేటికీ ఆదర్శనీయమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి