గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా పనిచేయాలి; సర్పంచ్ మంజుల
గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా పనిచేయాలి; సర్పంచ్ మంజుల
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామ వార్డు నెంబర్లు వాళ్ల వార్డులలో నెలకొన్న సమస్యల గురించి గ్రామానికి ముఖ్యఅతిథిగా వచ్చిన గ్రామ స్పెషల్ అధికారికి, సర్పంచుకు తెలియజేశారు. ముఖ్యంగా వార్డులలో సిసి రోడ్లు పనులు, విద్యుత్ స్తంభాలు, మురికి కాలువలు, వీధిలైట్లు, అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వార్డులలో నెలకొన్నసమస్య ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. అనంతరం గ్రామాల్లోని పలువురు మాట్లాడగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లకు రాలేదని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి , స్థానిక సర్పంచ్ మంజుల మాట్లాడుతూ... అర్హులైన పేదవారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. గ్రామంలో పలు వార్డులలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేస్తానని అన్నారు. గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చు దుద్దడానికిరాజకీయల అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి