Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు కి వీడ్కోలు

గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు కి వీడ్కోలు

గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు కి వీడ్కోలు
February 16, 2026 04:52 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


నార్కట్ పల్లి సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిరంలో ఘన అంతిమ సంస్కారాలు – వేలాది మంది నివాళులు

నార్కట్ పల్లి మండల కేంద్రంలోని సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు, సీనియర్ పాస్టర్ బిషప్ సి. హెచ్. జయరాజు (62) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బసవతారకం వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతి వార్త ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషాదాన్ని నింపింది. మంగళవారం నార్కట్ పల్లిలోని సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిరంలో ఆయన భౌతిక దేహానికి వేలాది మంది క్రైస్తవులు పూలమాలలు అర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రార్థనలు నిర్వహించి అంతిమ యాత్రను శ్రద్ధగా చేపట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్, సూర్యాపేటకు చెందిన చార్లెట్ దాతృత్వ సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, బిషప్ జయరాజు ఆధ్యాత్మిక సేవలో అనేక సంవత్సరాలు గడిపి వేలాది మంది విశ్వాసులను ఆత్మీయ మార్గంలో నడిపించారని తెలిపారు. ఆయనకు భార్య రెచల్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, సమాజంలో సేవాభావంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ పాస్టర్ చింత మనిషే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ నాయకులు పోకల అశోక్, సీనియర్ నాయకులు మర్రి రాజు , నకిరేకల్ నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు వేముల హనోక్ , బిషప్ వై. సమర్పణ కుమార్ , జాన్సీ రాణి , తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు బాకీ పరంజ్యోతి , చింత సుధాకర్, పాస్టర్ రావుల అమ్రామ్, పాస్టర్ ఏసురత్నం , పాస్టర్ జిల్లా సంసన్, పాస్టర్ జీవప్రకాశ్ బల్లెం, పాస్టర్ నామ మోజెష్, కత్తుల యెహోవా దాసు తదితరులు పాల్గొన్నారు.

బిషప్ సి. హెచ్. జయరాజు ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని శ్రద్ధాంజలి ఘటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News