Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:58 AM

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
February 25, 2026 05:59 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కూసుమంచి మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కర్త, ఏఆర్ ఏఎస్ఐ ఇంటూరి శేఖర్ రావు తెలిపారు.బుధవారం కూసుమంచిలోని పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, పాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అర్చకులు రఘునాథచార్యులు, ముడుంబ శ్రీమన్నారాయణ చార్యుల చేత శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి ఆశీర్వాద తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ తిరుకల్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్మాణ కమిటీ కోరింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News