గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
Biksham Goud
కూసుమంచి మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కర్త, ఏఆర్ ఏఎస్ఐ ఇంటూరి శేఖర్ రావు తెలిపారు.బుధవారం కూసుమంచిలోని పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, పాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అర్చకులు రఘునాథచార్యులు, ముడుంబ శ్రీమన్నారాయణ చార్యుల చేత శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి ఆశీర్వాద తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ తిరుకల్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్మాణ కమిటీ కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి