Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:39 PM

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
February 25, 2026 05:59 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కూసుమంచి మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కర్త, ఏఆర్ ఏఎస్ఐ ఇంటూరి శేఖర్ రావు తెలిపారు.బుధవారం కూసుమంచిలోని పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, పాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అర్చకులు రఘునాథచార్యులు, ముడుంబ శ్రీమన్నారాయణ చార్యుల చేత శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి ఆశీర్వాద తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ తిరుకల్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్మాణ కమిటీ కోరింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News