గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి
గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి
Biksham
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్
స్థానికం ప్రతినిధి
గౌడ్ అధికారుల మరియు వృత్తిపరుల సంఘం గోపా సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి సార ప్రభాకర్ గౌడ్ అధ్యక్షత వహించగా, నూతన కార్యవర్గ ఎంపికతో పాటు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ, గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా నిరంతరంగా ప్రవహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్నత చదువులు చదివిన వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు గోపా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.గోపా సభ్యులందరికీ నాగోల్ హైదరాబాద్లోని సుప్రజా ఆసుపత్రి సహకారంతో ముప్పై శాతం రాయితీతో ఆరోగ్య కార్డు సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో సంఘ భవన నిర్మాణం చేపట్టి గౌడ్ సమాజానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకే వేదికపై సమీకరిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ, సర్టిఫికెట్లలో పేరు చివర గౌడ్ అని లేకపోయినా, పరిచయ సమయంలో పేరు చివర గౌడ్ అని తెలియజేయాలని సూచించారు. దీని ద్వారా వివిధ శాఖల్లో పని చేస్తున్న మనవారి సహకారం పెరుగుతుందని, ఐక్యత మరింత బలపడుతుందని అన్నారు.ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యల్మకంటి మీరయ్య గౌడ్ కూడా హాజరయ్యారు. జిల్లా సభ్యుల సమక్షంలో నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు.
నూతన కార్యవర్గ సభ్యులు:
ముఖ్య సలహాదారుడు – పూసల లింగా గౌడ్,జిల్లా అధ్యక్షుడు – సార ప్రభాకర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి – డాక్టర్ కే రాజు గౌడ్, కోశాధికారి – శంకరి వెంకట్ స్వామి గౌడ్,ఉపాధ్యక్షులు – రాం చందర్ గౌడ్, రాములు గౌడ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి – చెన్న గౌడ్,సంయుక్త కార్యదర్శి – విట్టల్ గౌడ్
ఈ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి