PRINT TIME: May 26, 2026 04:33 PM
గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం
గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం
May 21, 2026 11:09 AM
76 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది దైద వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, గ్రామ సర్పంచ్ కొండ అరుణ సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ సేవలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది దైద నాగయ్య, నేరేడు రాములు, ముద్దం మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి