మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది దైద వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, గ్రామ సర్పంచ్ కొండ అరుణ సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ సేవలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది దైద నాగయ్య, నేరేడు రాములు, ముద్దం మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి