Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:56 PM

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

 గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి
February 24, 2026 04:00 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల ప్రజలకు మండల అభివృద్ధి అధికారిణి కీలక సూచనలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు మరియు ఇతర మార్గాల ద్వారా కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవసరమైన పత్రాలపై ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో, గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపిడిఓ) టి.సరస్వతి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు అసత్య ప్రచారాలను, అపోహలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కేవలం “స్పౌస్ పెన్షన్లు” మాత్రమే అమలులో ఉన్నాయని తెలిపారు. అంటే, పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆ పెన్షన్‌ను భార్యకు మంజూరు చేసే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని వివరించారు. దీనికి మినహా ఇతర కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, సంబంధిత వివరాలను అధికారికంగా గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

అనవసరంగా మీసేవ కేంద్రాలు లేదా సచివాలయాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని, అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News