Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:33 PM

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

 గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి
24-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల ప్రజలకు మండల అభివృద్ధి అధికారిణి కీలక సూచనలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు మరియు ఇతర మార్గాల ద్వారా కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవసరమైన పత్రాలపై ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో, గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపిడిఓ) టి.సరస్వతి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు అసత్య ప్రచారాలను, అపోహలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కేవలం “స్పౌస్ పెన్షన్లు” మాత్రమే అమలులో ఉన్నాయని తెలిపారు. అంటే, పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆ పెన్షన్‌ను భార్యకు మంజూరు చేసే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని వివరించారు. దీనికి మినహా ఇతర కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, సంబంధిత వివరాలను అధికారికంగా గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

అనవసరంగా మీసేవ కేంద్రాలు లేదా సచివాలయాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని, అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

Article Image

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల ప్రజలకు మండల అభివృద్ధి అధికారిణి కీలక సూచనలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు మరియు ఇతర మార్గాల ద్వారా కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవసరమైన పత్రాలపై ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో, గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపిడిఓ) టి.సరస్వతి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు అసత్య ప్రచారాలను, అపోహలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కేవలం “స్పౌస్ పెన్షన్లు” మాత్రమే అమలులో ఉన్నాయని తెలిపారు. అంటే, పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆ పెన్షన్‌ను భార్యకు మంజూరు చేసే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని వివరించారు. దీనికి మినహా ఇతర కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, సంబంధిత వివరాలను అధికారికంగా గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

అనవసరంగా మీసేవ కేంద్రాలు లేదా సచివాలయాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని, అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News