“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”
“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
“హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి నల్లగొండ పట్టణంలో చిన్న పాకెట్లుగా అమ్ముతున్న మత్తు పదార్థ యువకుల గ్యాంగ్ను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.”
పొరగాండ్లుమత్తు వ్యసనాలకు బానిసలై, దొంగతనాలు చేసే పరిస్థితి గురించి టూ టౌన్ పోలీసులు గమనించారు. హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి, నల్లగొండ పట్టణంలో చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతూ, మత్తుకు బానిసలై బైక్ దొంగతనాలు మొదలుపెట్టిన యువకుల గ్యాంగ్ను పట్టుకున్నారు. శివాజీనగర్ చౌరస్తా సమీపంలోస్థానిక సమాచారంతో చెక్ చేస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
A 1 సమద్ (శివాజీనగర్) బైక్ నుంచి దూకి పరారయ్యాడు. A 2 గడిదల పవన్ (బీట్ మార్కెట్), A 3 నాగుల సంపత్ (నర్సింగ్ బట్ల గ్రామం), A 4 పెండ్ర పరశురామ్ (సుభాష్ చంద్రబోస్ నగర్), A 5 కట్ల వెంకటేశ్వర్లు @ పవన్ (వివేకానంద నగర్)గా నల్లగొండ వాసులుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి రెండు కిలోలగంజాయి, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం. విచారణలో గతంలో చేసిన రెండు బైక్ దొంగతనాలు బయటపడ్డాయని డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత కఠిన చర్యలుతీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ S. రాఘవరావు ఆధ్వర్యంలో, ఎస్సై సైదులు సిబ్బందితో జరిగింది.ఈ కార్యక్రమం పోలీసుల సమర్పణ, స్థానిక సమాచారం ద్వారా మత్తు పదార్థ వ్యాపారం, దొంగతనాల నిర్వహణలో విజయం. ముందు కోసం కఠిన చర్యలు తీసుకోవడంసమాజం మెచ్చుకుంటుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి