గిరిజనుల ఆధ్యాత్మిక దీప్తి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
గిరిజనుల ఆధ్యాత్మిక దీప్తి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
స్థానికం బృందం
భువనగిరి, గిరిజన సమాజానికి మార్గదర్శకుడైన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రావి భద్రాద్రి గార్డెన్ లో వైభవంగా నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికోత్సాహంతో నిండింది.
ఈ వేడుకలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవైస్ రహమాన్ చిస్తీ, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమానాయక్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావ్, భువనగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ తాడక వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
అలాగే భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి టి. నాగిరెడ్డి హాజరై గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బానోతు నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గౌరవ అధ్యక్షులు బానోతు రాములు నాయక్, బుక్క రమేశ్ నాయక్, ముడి వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి