గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ
గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ
Biksham
కోదాడ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పరిధిలోని గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో మిల్లర్లు అప్పగిస్తున్న బియ్యం నిల్వలను పరిశీలిస్తూ పలు అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టాకు నమోదులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గిడ్డంగిలో ఉన్న స్టాకు రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా గిడ్డంగిలో పనిచేస్తున్న హమాలీలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరగా, త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హమాలీలకు తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిడ్డంగుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులు జరగాలని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి