Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:38 PM

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ
April 13, 2026 06:22 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోదాడ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పరిధిలోని గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో మిల్లర్లు అప్పగిస్తున్న బియ్యం నిల్వలను పరిశీలిస్తూ పలు అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టాకు నమోదులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గిడ్డంగిలో ఉన్న స్టాకు రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా గిడ్డంగిలో పనిచేస్తున్న హమాలీలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరగా, త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హమాలీలకు తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిడ్డంగుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులు జరగాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News