Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం. కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 08:08 PM

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ
April 13, 2026 06:22 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోదాడ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పరిధిలోని గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో మిల్లర్లు అప్పగిస్తున్న బియ్యం నిల్వలను పరిశీలిస్తూ పలు అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టాకు నమోదులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గిడ్డంగిలో ఉన్న స్టాకు రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా గిడ్డంగిలో పనిచేస్తున్న హమాలీలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరగా, త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హమాలీలకు తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిడ్డంగుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులు జరగాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News