ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Vaddeman Suresh
జెండా ఆవిష్కరించిన సర్పంచ్ మద్దెల మంజుల
వలిగొండ స్థానికం ప్రతినిధి:వలిగొండ మండల పరిధిలోని కేర్చీపల్లి గ్రామంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు గ్రామ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం అహింస శాంతి సంఘీభావం సార్వత్రిక సౌబ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దయ్యాల మల్లేష్ కురుమ పాల సంఘం చైర్మన్ జి గౌలేష సెక్రెటరీ కందాడి భూపాల్ రెడ్డి గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు అంగన్వాడీ కార్యకర్త పాల సొసైటీ సభ్యులు సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి