Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:05 AM

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ
18-03-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈదమ్మ తల్లి పండుగ నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో పండుగ ఏర్పాట్లు మరింత విస్తృతంగా చేపట్టారు. పల్లపు వారి ఆధ్వర్యంలో వడ్డెరల కులదేవత ఈదమ్మ తల్లి పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తరాలు, అలంకరణలు నిర్వహించి చీర, సారే సమర్పించారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆహ్వానం మేరకు పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భోజన వసతులు కల్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కోనేటి యాదగిరి , పొలాగోని స్వామి , చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు. పల్లపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను విజయవంతం చేశారు.

Sthanikam

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈదమ్మ తల్లి పండుగ నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో పండుగ ఏర్పాట్లు మరింత విస్తృతంగా చేపట్టారు. పల్లపు వారి ఆధ్వర్యంలో వడ్డెరల కులదేవత ఈదమ్మ తల్లి పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తరాలు, అలంకరణలు నిర్వహించి చీర, సారే సమర్పించారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆహ్వానం మేరకు పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భోజన వసతులు కల్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కోనేటి యాదగిరి , పొలాగోని స్వామి , చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు. పల్లపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News