ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ
ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ
స్థానికం బృందం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈదమ్మ తల్లి పండుగ నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో పండుగ ఏర్పాట్లు మరింత విస్తృతంగా చేపట్టారు. పల్లపు వారి ఆధ్వర్యంలో వడ్డెరల కులదేవత ఈదమ్మ తల్లి పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తరాలు, అలంకరణలు నిర్వహించి చీర, సారే సమర్పించారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆహ్వానం మేరకు పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భోజన వసతులు కల్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కోనేటి యాదగిరి , పొలాగోని స్వామి , చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు. పల్లపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి