రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ అండాలు–మల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్, ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య, వర్కాల వినయ్, వంగాల పూజిత, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, వీరమల్ల వీరేశం, వర్కాల సాయి, శంకరయ్య, నాగమణి, వర్కాల సుజాత, నారాపాక హారిక, లాలమ్మ, కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి