Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యుదాఘాతంతో రైతు మృతి జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 05, 2026 09:36 AM

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
April 05, 2026 03:32 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

యేసు ప్రభువువారి ఈస్టర్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాస్టర్ ఆఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీర్గనైజేషన్ తో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరత్నం బాబు హాజరై జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు పండుగలు పట్టణంలో ఎంతో శాంతియుతంగా క్రైస్తవులు జరుపుకుంటారని ఈ ర్యాలీ ఏసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన సందర్భంగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో వీధుల్లో పరిగెడుతూ నినాదాలతో దేవుని స్తుతిస్తారని కొనియాడారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ ప్రపంచవంతటా క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలు అని ఇవి ఎంతో శాంతియుతంగా క్రైస్తవులు జరుపుకుంటారని సర్వమానవారికి ఏసుప్రభు రక్షకుడిగా మానవాళి పాపం కొరకు చనిపోయి తిరిగి లేచాడని కొనియాడారు.

ఆరు మండలాల నుంచి ప్రజలు తండోపతండాలుగా పాల్గొని ఏసుప్రభు కొరకు పరుగు అని నినాదం చేస్తూ ఎంతో ఉత్సాహంగా పరుగులు తీశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ కోర్ కమిటీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రావణ్ కుమార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెవ డాక్టర్ యేసయ్య, కోర్ కమిటీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గుడిబండ ఏసయ్య, నియోజకవర్గ ప్రెసిడెంట్ బ్రదర్ రామారావు, టౌన్ ప్రెసిడెంట్ సైమన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాస్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, సెక్రెటరీ కొర్నేలీ, యూత్ ప్రెసిడెంట్ సురేష్, పంది తిరపతయ్య, రాంబాబు, పౌలు చారి, అనంతగిరి ప్రెసిడెంట్ రాజేష్, మోతే ప్రెసిడెంట్ లాజర్, నల్గొండ ప్రెసిడెంట్ గాబ్రియల్, ఇంకా స్త్రీలు పురుషులు యవనస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News