Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:09 AM

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....
February 18, 2026 05:48 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో గల స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ బాబు ,వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు లు ముఖ్య అతిథిలుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా దేవత అయిన సరస్వతి దేవి విగ్రహన్ని పాఠశాలలో ప్రతిష్ఠించడం విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ సభ్యులను, విగ్రహ దాత దేవరశెట్టి సొమ్మమ్మ జ్ఞాపకార్ధం కుమారుడు దేవరశెట్టి లక్ష్మి నారాయణ , పుష్పవతి లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వప్న, ఆర్యవైశ్య పెద్దలు పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ అధ్యక్షులు పబ్బా గీత,దేవి, వెంకటేశ్వర్లు,సెక్రటరీ ఓరుగంటి రమా, వెంకటేశ్వర్లు,కోశాధికారి యాద రాణి,శ్రీనివాసరావు,బొగ్గారాపు రేఖ రామ్మూర్తి,మంజుల, ఆంజనేయులు యాద శ్రీనివాసరావు,ఓరుగంటి దీపిక,ధనలక్ష్మి, ఇమ్మడి సంధ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News