Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:41 PM

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....
February 18, 2026 05:48 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.....

కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో గల స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ బాబు ,వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు లు ముఖ్య అతిథిలుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా దేవత అయిన సరస్వతి దేవి విగ్రహన్ని పాఠశాలలో ప్రతిష్ఠించడం విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ సభ్యులను, విగ్రహ దాత దేవరశెట్టి సొమ్మమ్మ జ్ఞాపకార్ధం కుమారుడు దేవరశెట్టి లక్ష్మి నారాయణ , పుష్పవతి లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వప్న, ఆర్యవైశ్య పెద్దలు పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ అధ్యక్షులు పబ్బా గీత,దేవి, వెంకటేశ్వర్లు,సెక్రటరీ ఓరుగంటి రమా, వెంకటేశ్వర్లు,కోశాధికారి యాద రాణి,శ్రీనివాసరావు,బొగ్గారాపు రేఖ రామ్మూర్తి,మంజుల, ఆంజనేయులు యాద శ్రీనివాసరావు,ఓరుగంటి దీపిక,ధనలక్ష్మి, ఇమ్మడి సంధ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News