ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
Biksham Goud
పేదలందరికీ సొంత గూడు కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకుల స్పష్టం
తిరుమలాయపాలెం
ప్రతి ఒక్కరికి సొంత గూడు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమం బుధవారం తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, జిల్లా నాయకుడు రామసహాయం అరవింద రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేదలందరికీ కూడు, గూడు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలోనూ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన ప్రభుత్వానికి, తమకు తోడ్పాటు అందించిన నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిపాటి మల్లికార్జున, మండల కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం హరిత రెడ్డి, ఇతర గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి