ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
K.RAVI
చౌటుప్పల్ టిడిపి కార్యాలయంలో నివాళులర్పించిన నేతలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ. పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, తడక కోటేష్, గోవిందాచారి, వెంకటేశం, అంతటి కిష్టయ్య, అంజయ్య, లక్కారం జంగయ్య గౌడ్, బొంగు బాదుషా, చెరుకు అశోక్ గౌడ్, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి