Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 28, 2026 10:57 PM

ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
May 28, 2026 09:48 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ టిడిపి కార్యాలయంలో నివాళులర్పించిన నేతలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ. పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, తడక కోటేష్, గోవిందాచారి, వెంకటేశం, అంతటి కిష్టయ్య, అంజయ్య, లక్కారం జంగయ్య గౌడ్, బొంగు బాదుషా, చెరుకు అశోక్ గౌడ్, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News