గీత కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన నేత ధర్మబిక్షం
గీత కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన నేత ధర్మబిక్షం
Editor Desk
గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మబిక్షం 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ధర్మబిక్షం భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, సేవలు గీత పనివారల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.
గీత పనివారల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని పేర్కొన్నారు. గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్లు కల్పించడం, తాటి చెట్ల పెంపకానికి సొసైటీలకు భూముల కేటాయింపు, వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందేలా చేయడం వంటి అంశాలు ఆయన పోరాట ఫలితమని గుర్తుచేశారు. గౌడన్నలను ఏకం చేసి ప్రభుత్వాలతో పోరాడి హక్కులు సాధించారని అన్నారు.
ధర్మబిక్షం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంగాపురం వెంకటయ్య, ఎర్ర వెంకటేశం, బాలగోని మల్లయ్య, బాలగోని నరసింహ, గంగాపురం యాదయ్య, వీరమల్ల వెంకటయ్య, ఎర్ర సత్తయ్య, వీరమల్ల ముత్తయ్య, చెరుకు శివరాజు, పెండెం రవీందర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి