Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:59 AM

గ్యాస్ కొరతపై సిపిఐ ఆందోళన – కేంద్ర నిర్లక్ష్యంపై మండిపాటు

గ్యాస్ కొరతపై సిపిఐ ఆందోళన – కేంద్ర నిర్లక్ష్యంపై మండిపాటు

గ్యాస్ కొరతపై సిపిఐ ఆందోళన – కేంద్ర నిర్లక్ష్యంపై మండిపాటు
March 17, 2026 03:32 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యుద్ధం వద్దు… ప్రపంచ శాంతి వర్ధిల్లాలి – సుభాష్ సెంటర్‌లో ఆందోళన

రామన్నపేట,

జీవనోపాధులను దెబ్బతీస్తున్న గ్యాస్ కొరతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నివారించాలని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ డిమాండ్ చేశారు.

ఈ మేరకు రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఊట్కూరి నరసింహ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలను ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనివల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

అమెరికా ఇరాన్‌పై చేస్తున్న దాడులను ఖండిస్తూ యుద్ధం కాకుండా ప్రపంచ శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి కళ్ళెం రామచంద్రం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం యాదయ్య, పల్లె మల్లేశం, పర్స సుదర్శన్, ఊట్కూరు కృష్ణ, ఊట్కూరు శీను, పెండెం రవీందర్, ఏనూతుల రమేష్, కడమంచి జగన్నాథం, వీసం గాలయ్య, ఊట్కూరు శంకర్, జెల్లా అంబయ్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News