PRINT TIME: March 16, 2026 05:09 PM
గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా
గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా
March 16, 2026 03:19 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం సంగెం గ్రామం లో సోమవారం గ్యాస్ కొరత లేకుండా నివారించాలని.. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై మహిళలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ప్రజల సంక్షేమంగా పనిచేశారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి,మండల నాయకులు మల్యాల రాములు ,మాజీఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, నాయకులు శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి