Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:56 AM

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు
March 26, 2026 08:24 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించిన నేపథ్యంలో, టిఫిన్ సెంటర్ల, హోటల్ యజమానులు దీనిని ఆసరా చేసుకుని టిఫిన్ ధరలను పెంచడం జరిగింది. కృతిమ కొరతను సృష్టించిన గ్యాస్ ఏజెన్సీల వారు గ్యాస్ ను అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కిసాన్ మోర్చ మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఆర్‌డీవో కార్యాలయంలో డీటీ సతీష్ కు మెమొరాండం అందజేయడం జరిగింది. ప్రజలకు అవసరమైన గృహ వినియోగ గ్యాస్‌పై అధిక ధరలు వసూలు చేయడం వలన సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాలపై ఈ అదనపు భారం మరింత ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మెమొరాండం ఇచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల అధ్యక్షులు వీరబాబు, అనంతగిరి మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు జల్లా జనార్ధన్, రాష్ట్ర నాయకులు చిట్టయ్య, కృష్ణ ప్రసాద్, దేవరశెట్టి సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, భూమా శ్రీనివాస్, సాగర్ల సతీష్, కొండయ్య, సుధాకర్ రెడ్డి, శంకర్, పసి, బిజేపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News