గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు
గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు
Harish HS
గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు
గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించిన నేపథ్యంలో, టిఫిన్ సెంటర్ల, హోటల్ యజమానులు దీనిని ఆసరా చేసుకుని టిఫిన్ ధరలను పెంచడం జరిగింది. కృతిమ కొరతను సృష్టించిన గ్యాస్ ఏజెన్సీల వారు గ్యాస్ ను అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కిసాన్ మోర్చ మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో డీటీ సతీష్ కు మెమొరాండం అందజేయడం జరిగింది. ప్రజలకు అవసరమైన గృహ వినియోగ గ్యాస్పై అధిక ధరలు వసూలు చేయడం వలన సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాలపై ఈ అదనపు భారం మరింత ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మెమొరాండం ఇచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల అధ్యక్షులు వీరబాబు, అనంతగిరి మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు జల్లా జనార్ధన్, రాష్ట్ర నాయకులు చిట్టయ్య, కృష్ణ ప్రసాద్, దేవరశెట్టి సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, భూమా శ్రీనివాస్, సాగర్ల సతీష్, కొండయ్య, సుధాకర్ రెడ్డి, శంకర్, పసి, బిజేపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి