గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ వాగ్దానాలు
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి : జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండల పరిధిలోని గురుజువడ గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం మంగళవారం నాడు మూడు బోర్లను మరమ్మతులు చేశామని గురుజువడ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి గ్రామ సర్పంచిగా ఎన్నుకొని తమ బాధ్యతను మరింత పెంచిందని, గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఒకొక్కటిగా ప్రజల సహకారంతో పరిష్కరిస్తామని, అన్ని వార్డుల్లో తాగునీటి కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి ప్రతి గల్లీలో కుళాయిలు, బోర్లను ప్రజలకు నీటి కోసం ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తామని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి