PRINT TIME: April 11, 2026 08:15 AM
గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు
గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు
December 31, 2025 05:12 PM
90 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి సానిక ప్రతినిధి
మొన్న జరిగిన దుర్ఘటన నార్కట్పల్లి పట్టణంలోని వైఎస్సార్ కాలనీ 6వ వార్డును కలచివేసింది. జంగాల బర్రె చిన్న లింగమ్మ–చిన్న వెంకన్న దంపతుల గుడిసె కరెంట్ షార్ట్సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. గుడిసెతో పాటు ఇంట్లో ఉన్న బట్టలు, నిత్యావసర వస్తువులు అన్నీ మంటల్లో కాలిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న నార్కట్పల్లి 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టసమయంలో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం బాధితులకు కొంత ఊరటను కలిగించింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ 5వ వార్డు అభ్యర్థి బండారు చందుతో పాటు రుద్రాక్ష భాస్కర్, పాల పరశురాం, మంద శంకర్, మంద స్వామి, లింగాల దేవేందర్, కొత్తూరు నవీన్, పందుల రాకేష్, మద్దెల మధు, యనమల నరసింహ, మంద భరత్, జీడిమెట్ల మధు, మంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి