Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:54 AM

గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు

గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు

గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు
December 31, 2025 05:12 PM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి సానిక ప్రతినిధి

మొన్న జరిగిన దుర్ఘటన నార్కట్పల్లి పట్టణంలోని వైఎస్సార్ కాలనీ 6వ వార్డును కలచివేసింది. జంగాల బర్రె చిన్న లింగమ్మ–చిన్న వెంకన్న దంపతుల గుడిసె కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. గుడిసెతో పాటు ఇంట్లో ఉన్న బట్టలు, నిత్యావసర వస్తువులు అన్నీ మంటల్లో కాలిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న నార్కట్పల్లి 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టసమయంలో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం బాధితులకు కొంత ఊరటను కలిగించింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ 5వ వార్డు అభ్యర్థి బండారు చందుతో పాటు రుద్రాక్ష భాస్కర్, పాల పరశురాం, మంద శంకర్, మంద స్వామి, లింగాల దేవేందర్, కొత్తూరు నవీన్, పందుల రాకేష్, మద్దెల మధు, యనమల నరసింహ, మంద భరత్, జీడిమెట్ల మధు, మంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News