గట్టు ఎల్లయ్యకు నివాళి… కుటుంబానికి సుధీర్ బాబు ఆర్థిక సాయం
గట్టు ఎల్లయ్యకు నివాళి… కుటుంబానికి సుధీర్ బాబు ఆర్థిక సాయం
స్థానికం బృందం
రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది గట్టు ఎల్లయ్య అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేసిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ ఉపేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్, ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు నక్క రాములు, నల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు చొప్పరి లింగయ్య, బీరం రాంరెడ్డి, వంగాల నవీన్, ఎరబోయిన సత్తయ్య, రేముడాల వెంకన్న, గట్టు శేఖర్, వంగాల సాయి, మేడబోయిన శ్రవణ్, బాతుకు అంజయ్య, అక్కెనపల్లి యాదయ్య సహా పలువురు హాజరై ఎల్లయ్య కుటుంబానికి ధైర్యం చెప్పారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి