Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 11:13 AM 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరయ్యారు. ముందుగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ రూపకల్పనకు ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆత్మను ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు.గ్రంథాలయాలు విజ్ఞాన సంపదను పెంపొందించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, విద్యార్థులు, యువకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News