గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరయ్యారు. ముందుగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ రూపకల్పనకు ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆత్మను ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు.గ్రంథాలయాలు విజ్ఞాన సంపదను పెంపొందించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, విద్యార్థులు, యువకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి