గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర బడ్జెట్
గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర బడ్జెట్
Biksham Goud
ఉపాధి హామీకి నిధుల లేవు – పింఛన్ల పెంపు ప్రస్తావన లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ఉపాధి పనుల అమలుకు అవసరమైన 40 శాతం రాష్ట్ర వాటా నిధులను కేటాయించకపోవడం, పింఛన్ల పెంపు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వ్యవసాయ కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు, కొత్తగా ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఆరు హామీల అమలుపై కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం పేరుతో తగిన నిధులు కేటాయించకపోవడం, కౌలు రైతులకు ఇచ్చే సహాయం, మహిళలకు ప్రకటించిన హామీలపై ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కొత్త లబ్ధిదారులకు అదనపు నిధులు కేటాయించకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.భూ నిర్వాసితుల సమస్యలు, పునరావాసంపై కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ పేదలకు న్యాయం చేయలేదని మట్టిపల్లి సైదులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి