గ్రామస్థుల ఐక్యమత్యం అభివృద్దికి నిదర్శనం - ఎమ్మెల్యే వేముల వీరేశం
గ్రామస్థుల ఐక్యమత్యం అభివృద్దికి నిదర్శనం - ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
పంచాయతీ పాలకవర్గనికి సన్మానం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట (యాదాద్రి భువనగిరి): నిదానపల్లి గ్రామపంచాయతీ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రామాన్ని సందర్శించి, కొత్తగా ఎన్నుకోబడిన పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు
గ్రామపంచా యతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు సల్ల శిల్ప, కొండ శ్రీనివాస్ గౌడ్, వర్కాల వినయ్, కొండ అండాలు, ఏకుల మల్లేశం, భాషమల్ల అనిత, వంగాల పూజిత, కడారి ఐలయ్య తదితరులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ,“పంచాయతీ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఏకగ్రీవ ఎన్నికలు మంచి సంకేతం. సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం” అని తెలిపారు.గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి