Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:04 PM

గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలి… అధికారులకు స్పష్టం

గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలి… అధికారులకు స్పష్టం

గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలి… అధికారులకు స్పష్టం
April 09, 2026 07:33 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాడు. మండలంలోని గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాడు.ఎండకాలం నేపథ్యంలో ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చూడాలని, పైపులైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, అవసరమైతే కొత్త బోర్లు త్రవ్వించి లేదా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించాడు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కల్పించాలని, వ్యవసాయం మరియు గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని స్పష్టం చేశాడు. ఎక్కడైనా లూజ్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపాడు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులకు సూచించాడు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నాడు.ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News